నందికొండ/కేతేపల్లి, అక్టోబర్ 1 : నాగార్జునసాగర్ రిజర్వాయర్కు ఎగువ నుంచి ఇన్ఫ్లో పెరగడంతో డ్యాం ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం 65,939 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగగా.. క్రస్ట్గేట్లు, కాల్వల ద్వారా మొత్తం 90,259 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉన్నది. మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 10,167.21 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. దీంతో ప్రాజెక్టు 3 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. క్రస్ట్గేట్లు, కాల్వల ద్వారా మొత్తం 5,806 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 642.750 అడుగులు (3.88 టీఎంసీలు) ఉన్నట్టు ప్రాజెక్టు ఏఈ ఉదయ్కుమార్ తెలిపారు.