హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఝుటా బీజేపీ నేత జుమ్లా మాటలివి. కేంద్రంలో గొప్ప హోదాలో ఉండి మాట్లాడిన పచ్చి అబద్ధాలివి. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. అబద్ధాలు వల్లె వేశారు. వాస్తవాలను కప్పిపుచ్చుతూ.. నిరాధార ఆరోపణలు చేశారు. తెలంగాణకు నయా పైసా ఇవ్వకున్నా.. రాష్ట్రంలోని పథకాలన్నీ తమ పైసలతోనే అమలవుతున్నట్టు కలరింగ్ ఇచ్చారు. కేంద్ర పథకాల పేర్లు మార్చి రాష్ట్రంలో అమలుచేస్తున్నట్టు అభాండాలు మోపారు. అబద్ధాలతో గ్రామీణ అమాయక ప్రజలను మోసం చేసేందుకు శత విధాల ప్రయత్నించారు. ఆమె చెప్పిన అబద్దాలేంటి? అందులో వాస్తవమేంటో ఓసారి పరిశీలిస్తే.. ప్రజల కోసం పాటుపడుతున్న, పైసలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఎవరిదో తెలిసిపోతుంది.