హైదరాబాద్, ఏప్రిల్13 (నమస్తే తెలంగాణ): దేశంలోనే తొలిసారిగా తెలంగాణ సర్కారు చరిత్రాత్మక నిర్ణయం తీసుకొన్నది. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి ఘనమైన నివాళి అర్పించింది. తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు, నాలుగు కోట్ల మంది ప్రజల సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలు తీసుకొనే కీలక భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడం సముచితమే కాదు గొప్ప నిర్ణయం కూడా.
కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతోపాటు దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి బాబాసాహెబ్కు కేసీఆర్ మహా గౌరవాన్ని కల్పించారు. యావత్తు దేశం ఆయనకు అభినందనలు తెలుపుతున్నది.