CM KCR | హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మాడల్ పాలనే ఎజెండాగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కార్యక్రమం 288 నియోజకవర్గాల్లో చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కే చంద్రశేఖర్రావు సూచించారు. ప్రతి గ్రామంలోనూ అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేయాలని పేరొన్నారు. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు ఉదృతంగా కొనసాగుతున్నాయి. గురువారం కూడా పలువురు మహారాష్ట్ర నుంచి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో చేరిన వారికి పార్టీ అధినేత గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పాలన మాడల్ గురించి కరపత్రాలు, బుక్లెట్లు, సోషల్ మీడియా, పోస్టర్లు, హోర్డింగ్స్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. మహారాష్ట్ర ప్రజలకు కూడా తెలంగాణ పథకాలు అందించాలనే స్ఫూరితో బీఆర్ఎస్ పని చేస్తుందని, అకడి రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ను ఆదరిస్తున్న తీరు సంతోషకరమని సీఎం అన్నారు. ఎన్నో నదులు ఉన్నప్పటికీ మహారాష్ట్ర రైతులకు అకడి ప్రభుత్వాలు సాగు నీరు అందించలేకపోవడం బాధాకరమని సీఎం కేసీఆర్ పేరొన్నారు.
ఎంతో మంది నాయకులు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అయ్యారు గాని మహారాష్ట్ర ప్రజలను పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ చేపట్టామని పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి రైతులకు పారదర్శక సేవలు అందిస్తున్నారని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఉచిత సాగునీరు సహా వ్యవసాయ రంగం అభివృద్ధికి పలు చర్యలతో రైతులకు ఒక భరోసా కల్పిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ సుభాష్ రాథోడ్, సేనాసంఘటన్ నుంచి ఉమేష్ చవాన్, బీజేపీకి చెందిన సివిల్ ఇంజనీర్ దీపక్ పవార్, భారత్పవార్, అకోలా బజార్ ఉపసర్పంచ్ అశోక్ రాథోడ్, ఉపాధ్యాయ్ సంఘటన్ యావత్మాల్ జిల్లా నాయకుడు అజయ్ రాథోడ్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రకాశ్రాథోడ్, శివసేన సరిల్ ప్రముఖుడు రాజేశ్ పవార్, శివసేన షిండే వర్గం నేత పర్వీన్ చవాన్ తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు శంకరన్న దొండ్గే , మాణిక్కదం, టీఎస్ఐడిసీ చైర్మన్ వేణుగోపాలాచారి, బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారి తదితరులు పాల్గొన్నారు.