తిరుపతి : కళియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని వైకుంఠ ఏకాదశి పర్వదినాన గురువారం పలువురు ప్రముఖులు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు.
వీరితో పాటుగా ఎంపీలు కొత్త ప్రభాకర్, రంజిత్ రెడ్డి, వెంకటేష్ రెడ్డి నేత, కవితలు, ఎమ్మెల్యేలు బాలరాజు, సండ్ర వెంకట వీరయ్య, మర్రి జనార్దన్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, శంకర్ నాయక్, వివేక్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, కొత్తపల్లి రవీంద్ర రావు, షంభీపూర్ రాజు వైకుంఠ ద్వార ప్రవేశం చేసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.