న్యూఢిల్లీ : కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రి పీయూష్ గోయల్తో శుక్రవారం రాత్రి తెలంగాణ మంత్రుల బృందం భేటీ అయింది. ఈ భేటీలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, బీబీ పాటిల్, సురేశ్ రెడ్డి పాల్గొన్నారు. వరి ధాన్యం సేకరణపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఖరీఫ్, రబీ ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టత ఇవ్వనున్నది.
ఈ నెల 23న మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం కేంద్ర మంత్రులు పీయూష్గోయల్, నరేంద్రసింగ్ తోమర్తో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన సంగతి తెలిసిందే. నాటి భేటీలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పూర్తి స్పష్టత ఇవ్వని కేంద్ర మంత్రులు ఈ నెల 26న మరోసారి సమావేశమవుదామని ప్రతిపాదించారు. కేంద్రం ఇచ్చే స్పష్టతకు అనుగుణంగా యాసంగిలో అనుసరించాల్సిన విధానంపై రైతులకు మార్గ నిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.