హైదరాబాద్ : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మృతి పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, సత్యవతి రాథోడ్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ సుఖేందర్రెడ్డి సంతాపం తెలిపారు.
పద్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు మంత్రులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని వారు పేర్కొన్నారు. కాగా, పద్మ 20 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.