హైదరాబాద్ : రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ(Manjulamma) మరణం పట్ల రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్( Telangana Ministers)సంతాపం ప్రకటించారు. మంజులమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంజులమ్మను నగరంలోని ఓ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మంజులమ్మ కొద్ది సేపటి క్రితం మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో రేపు ఉదయం అంత్యక్రియలు జరుగనున్నాయి.