TS Minister Talasani | పదో తరగతి పేపర్ కాపీయింగ్ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం హిందీ పేపర్ కాపీయింగ్ కేసులో ముఖ్య నిందితుడు బండి సంజయ్కు సన్నిహితుడు అని పేర్కొన్నారు. ఈ కేసులో ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తేల్చి చెప్పారు.
పేపర్ కాపీయింగ్ పేరుతో కుట్రకు తెర తీశారని తలసాని మండి పడ్డారు. పదో తరగతి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు పిల్లల్లేరా.. వాళ్లు చదువు కోవడం లేదా? అని నిలదీశారు. పేపర్ కాపీయింగ్ వెనుక బీజేపీ కుట్రను వెలికి తీయాలని అన్నారు.