హైదరాబాద్: పదో తరగతి పేపర్ లీకేజీ (10th Paper leakage) కేసులో అరెస్టైన బండి సంజయ్ (Bandi Sanjay) పై తెలంగాణ సమాజం దుమ్మెత్తి పోస్తున్నది. బీజేపీ స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆటాడుకుంటున్నదని జనం మండిపడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod) కూడా బండి సంజయ్పైన, బీజేపీ కుట్రలపైన ట్విటర్లో తీవ్ర విమర్శలు గుప్పించారు.
పదో తరగతి పేపర్ లీకేజీ ముమ్మాటికీ బీజేపీ కుట్రేనని సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం పేపర్ లీకేజీలకు పాల్పడటం దుర్మార్గపు చర్య అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే కుట్రలో అడ్డంగా దొరికిపోయిన దొంగ బండి సంజయ్ అని ఫైరయ్యారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎంపీని వెంటనే ఎంపీ పదవి నుంచి భర్తరఫ్ చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.
కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము లేకనే బీజేపీ నేతలు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. బీజేపీ దిగజారుడు చర్యలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితాలతో ఆటలాడుకుంటున్న బీజేపీని ప్రజలు గ్రామ గ్రామాన నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు.
పేపర్ లీకేజీ ముమ్మాటికి బీజేపీ కుట్రే
రాజకీయ లబ్ధి కోస పేపర్ లీకేజీలకు పాల్పడడం దుర్మార్గపు చర్య
ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే కుట్రలో అడ్డంగా దొరికిపోయిన దొంగ బండి.
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎంపీ @bandisanjay_bjp ని వెంటనే ఎంపీ పదవి నుండి భర్తరఫ్ చేయాలి.@KTRBRS pic.twitter.com/js1RKtSU2L
— Satyavathi Rathod (@SatyavathiTRS) April 5, 2023
కెసిఆర్ ను ఎదుర్కొనే దమ్ము బీజేపీ నేతలకు లేకే ఇలాంటి కుట్రలు
బిజెపి దిగజారుడు చర్యలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం
విద్యార్థులు వారి తల్లిదండ్రుల జీవితాలతో ఆటలాడుకుంటున్న బిజెపిని గ్రామ గ్రామాన ప్రజలు నిలదీయాలని కోరుతున్నాను.@KTRBRS @BRSHarish @RaoKavitha @PSReddyTRS @BRSparty
— Satyavathi Rathod (@SatyavathiTRS) April 5, 2023