సూర్యాపేట, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ, ఏపీ రాష్ర్టాల పునరేకీకరణ అంటూ ఆంధ్రా ప్రాంత నాయకుల వ్యాఖ్యలు ఓ తెలివి తక్కువ మాట. ఈ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారో తెలుసు. పార్లమెంట్లో తల్లిని చంపి బిడ్డను బతికించారన్న వారే కుట్రలు పన్నుతుండొచ్చు. భారత్ను ఇంగ్లండ్లో కలపాలి.. ఆంధ్రాను తమిళనాడులో కలపాలి అనేలా వాళ్ల వాఖ్యలు ఉన్నాయి’ అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ వైఫల్యమే బీజేపీకి ప్రాణం పోస్తున్నదని పేర్కొన్నారు. గుజరాత్లో ఎన్నికలు జరుగుతుంటే ఆ పార్టీ నేత రాహుల్గాంధీ పాదయాత్ర చేయడం అంటే ఆయనే బీజేపీకి పెద్ద కార్యకర్తగా మారినట్టు అనిపిస్తున్నదని పేర్కొన్నారు.
తెలంగాణను దేశానికే రోల్ మాడల్గా తీర్చిదిద్దిన కేసీఆర్ను దేశ ప్రజలు ప్రత్యామ్నాయంగా కోరుకుంటున్నారని, బీఆర్ఎస్తో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం చారిత్రక అవసరమని చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలో ప్రజలు పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు తప్ప ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల వచ్చింది కాదని చెప్పారు. పక్క రాష్ర్టాల్లో పరిస్థితులేంటో ప్రజలు చూస్తున్నారని, వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమం ఎలా ఉన్నదో తెలంగాణ ప్రజలు పోల్చుకుంటున్నారని తెలిపారు. మీడియా సంచలనాల కోసం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గుజరాత్లో బీజేపీ గెలవడం ఆ పార్టీ గొప్పతనం కాదని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే అని ఎద్దేవా చేశారు. ప్రజల్లో బీజేపీ, మోదీపై ఎంత వ్యతిరేకత ఉన్నా వాటిని ప్రజల్లోకి తీసుకోపోవడంలో కాంగ్రెస్ విఫలమైందని పేర్కొన్నారు. గుజరాత్లో ఫలితాలే ఇక్కడా పునరావృతం అవుతాయని బండి సంజయ్ వ్యాఖ్యలు సమంజసమేనని, ప్రస్తుత ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన అంగీకరించారని తెలిపారు. రాజకీయ పార్టీలు, వ్యాపారులు, వ్యాపార సంస్థలను టార్గెట్ చేస్తూ ఈడీ దాడులకు పాల్పడుతునట్టు చెప్పారు.
ఏపీ-తెలంగాణలను కలుపాలంటూ దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి అరుణ్కుమార్, సజ్జల రామకృష్ణారెడ్డికి అమరవీరుల ఉసురు తగులుద్ది. కేంద్రంలో బీజేపీ నాయకులు ఆడిస్తున్న ఆటలో ఏపీలోని నాయకులు కీలుబొమ్మలుగా మారొద్దు. విడిపోయి ప్రశాంతంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా ముందుకు సాగుతున్నాయి. అవసరమైతే విభజన చట్టంలోని హామీల కోసం కేంద్రంపై పోరాటానికి తెలంగాణ బిడ్డలు సైతం అండగా నిలుస్తాం. అంతేకానీ ప్రజల్లో ఆందోళన కలిగించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరం. అన్యాయంగా ఏపీలో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు అప్పగించాలి.
– ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
ఏపీ, తెలంగాణను కలిపి సమైక్య రాష్ట్రంగా మార్చాలంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు వ్యతిరేకంగా ఉన్నాయి. తెలంగాణ ప్రజల పోరాటం, బలమైన ఆకాంక్ష కారణంగానే తెలంగాణ ఏర్పడింది. మళ్లీ సమైక్య రాష్ట్ర నినాదం అనే వాదనతో ఉపయోగం లేదు. ఆ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకం. ప్రధాని మోదీ తన స్థాయిని మరిచిపోయి విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదు. హిమాచల్ప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోవడం దేశంలో వస్తున్న మార్పునకు నిదర్శనం. గుజరాత్లో గెలిచినట్టే తెలంగాణలోనూ గెలుస్తామంటున్న బండి సంజయ్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి.
– సీఎల్పీ నేత భట్టి విక్రమార
అవకాశం ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేందుకు ఓటేస్తామన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ బతికుంటే తెలంగాణ వచ్చేదే కాదంటున్న వైఎస్సార్టీపీ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల పిచ్చి ఆలోచనలు మానుకోవాలి. వీరిద్దరి వెనుక బీజేపీ ఉన్నది. బీజేపీ ఆడిస్తున్న నాటకంలో వీరు పాత్రదారులు. అసలు వీరిద్దరికి తెలంగాణతో ఏమీ సంబంధం ఉన్నది. తెలంగాణ ప్రజల, ఎందరో అమర వీరుల త్యాగం, ఉద్యమనేత కేసీఆర్ పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తే తస్మాత్ జాగ్రత్త. తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలుపుతాం అనే ఆలోచన వస్తే కళ్లు పీకేస్తాం. ఆ మాటలు మాట్లాడేవాళ్ల నాలుకలు కోస్తాం.
-దూదిమెట్ల బాల్రాజ్ యాదవ్, గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్
ఏ మాత్రం అవకాశం దొరికినా ఏపీ, తెలంగాణను కలిసి ఉండాలని కోరుకొంటామన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు శోచనీయం. తెలంగాణను ఏదో ఓ పద్ధతిలో దోచుకోవాలని ఇప్పటికీ ఆంధ్ర రాజకీయ నాయకత్వం ప్రయత్నం చేస్తున్నది. నదీ జలాల వాటా, 9, 10 వ షెడ్యూల్లోని సంస్థల విభజన పట్ల ఇప్పటికీ పీటముడి వేసి జటిలం చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లు గడిచినా విభజన సమస్యలు పరిషారం కాలేదు. ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటుపై ప్రతిసారి అకసు వెళ్లగకుతూనే ఉన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబం, మంత్రులపై నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తెలంగాణ నాయకత్వాన్ని అవమానించడమే లక్ష్యంగా వైఎస్ షర్మిల ప్రస్థానం సాగుతున్నది. ఆమె అరెస్ట్పై ప్రధాని, గవర్నర్, బీజేపీ నేతలు సానుభూతి వ్యక్తంచేయడంతో ఆమె ఆంధ్ర, కేంద్ర ప్రభుత్వాల బాణమని తేలిపోయింది.
– ఎర్రోజు శ్రీనివాస్, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఎనిమిదేండ్లలో అద్భుత ప్రగతి సాధించిన తెలంగాణను చూసి వైసీపీ, కేంద్రంలోని బీజేపీ సరారు అసూయపడుతున్నవి. అందుకే సమైక్య ఆంధ్ర పేరుతో మరోసారి కుట్రలు తెర తీశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా మార్చాలన్న ఉద్దేశంతోనే వైఎస్ షర్మిల తెలంగాణలో డ్రామాలు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ, వైసీపీ, వైఎస్ షర్మిల, రాష్ట్రంలోని మరికొన్ని పార్టీలు ఇవే కుట్రలతో పనిచేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన షర్మిల, రాజీనామాలు చేయకుండా పారిపోయిన బీజేపీ నేతలు.. ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో తిరుగుతూ ప్రజల్లో విద్వేషాన్ని నూరిపోస్తున్నారు. తెలంగాణ ప్రజలు వీరి మాయలో పడొద్దు.
-వై సతీశ్రెడ్డి, రెడో చైర్మన్