Telangana | భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 23: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రామలింగంపల్లికి చెందిన గూడూరు మణికాంత్రెడ్డి (21) ఫిలిప్పీన్స్ దేశంలో శనివారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితి లో మృతిచెందాడు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రామలింగంపల్లికి చెందిన గూడూ రు రాంరెడ్డి, రాధాకృష్ణ దంపతులకు కుమారుడు మణికాంత్రెడ్డి, కుమార్తె ఉన్నారు. మణికాంత్రెడ్డి ఫిలిప్పీన్స్ దేశంలోని దావూద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదివేందుకు గతేడాది ఆగస్టులో వెళ్లాడు. శనివారం రాత్రి అక్కడ భారీ వర్షం కురిసింది. రాత్రి 11 గంటల సమయంలో మణికాంత్రెడ్డి డ్రైనేజీ కాల్వలో విగతజీవిగా పడి ఉన్నాడు. తల వెనుక తీవ్ర గాయాలున్నాయి. బైక్ ప్రమాదం వల్ల కాల్వలో పడ్డాడా? హాస్టల్ మెట్ల మీది నుంచి జారిపడి మృతిచెందాడా? అనేది తెలియరాలేదు. ఆదివారం ఉదయం అక్కడి పోలీసులు మణికాంత్రెడ్డి తల్లిదండ్రులకు ఫోన్చేసి సమాచారమిచ్చారు. మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మృతదేహం రావడానికి రెండు, మూడు రోజుల సమయం పట్టొచ్చని సమాచారం.