హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగా ణ): వైద్యారోగ్యశాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ని యమకానికి కౌన్సెలింగ్ షెడ్యూల్ను తెలంగా ణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బో ర్డు శుక్రవారం ప్రకటించింది. 15 నుంచి 19 వరకు మల్టిజోనల్ వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నది. కొత్తగా ప్రారంభమైన మెడికల్ కాలేజీల్లో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వెంటవెంటనే చేపట్టి, 5 నెలల రికార్డు సమయంలోనే విజయవంతంగా పూర్తి చేసింది.
ఇప్పటికే మెరిట్ జాబితాను రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి, కొత్తగా ప్రారంభమైన మెడికల్ కాలేజీల్లో నియామక ఉత్వర్వులను జారీ చేయాల్సి ఉండగా, ఇందుకు షెడ్యూల్ను తాజాగా ప్రకటించింది. మల్టి జోన్-1 అభ్యర్థులకు 15, 16 తేదీల్లో, మల్టి జోన్- 2 అభ్యర్థులకు 17, 18 తేదీల్లో, 1, 2 మల్టి జోన్లలోని సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలకు 19వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు dme.telangana.gov.inను సందర్శించాలని బోర్డు సూచించింది.