Telangana Martyrs Memorial | హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): డప్పుల చప్పుళ్లు.. ఢమరుక నాదాలు.. ఒగ్గుడోలు మోతలు.. దండారి ఆటలు.. కొమ్ము నృత్యాలు.. బంజారా రీతులు.. ఇలా తెలంగాణ సమస్త సాంస్కృతిక కళారీతులు అమరులను ఆవాహన చేసుకొన్నాయి. సాగరతీరం యావత్తు తెలంగాణ సాంస్కృతిక వైభవ ప్రతిబింబమై నిలిచింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు అంబరాన్నంటాయి. రాష్ట్రనలుమూలల నుంచి 6,200 మందికిపైగా కళాకారులు తరలివచ్చారు. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ నేతృత్వంలో పీవీ మార్గ్ వద్ద ఉన్న 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి సచివాలయం ఎదుట నిర్మించిన అమరజ్యోతి వరకూ సంస్మరణ ర్యాలీని నిర్వహించారు. కళాకారుల సంస్మరణ ర్యాలీని, కళా ప్రదర్శనలను వీక్షించేందుకు నగరం నలుమూలల నుంచి ప్రజలు వేలాది సంఖ్యలో తరలివచ్చారు.
అమరుల సంస్మరణ ర్యాలీ అనంతరం నిర్వహించిన అమరజ్యోతి ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. గురువారం సాయంత్రం 6:15 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకొన్నారు. అత్యద్భుతంగా అమరుల స్ఫూర్తి ప్రజ్వలించేలా, త్యాగాల ప్రతిబింబంగా స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించిన అమరజ్యోతిని సందర్శించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అమరులకు నివాళు లు లర్పించారు. అనంతరం అమరజ్యోతి లోపలి ని ర్మాణాలను పరిశీలించారు. ఆడిటోరియంలో అమరవీరుల త్యా గాలు, తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించారు. అనంతరం అమరజ్యోతిని సీఎం కేసీఆర్ వెలిగించారు. 12 మంది పోలీసులు 12 తుపాకులతో 3 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి అమరవీరుల కు గన్ సెల్యూట్ను సమర్పించారు. పోలీసు అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ సైతం అమరవీరులకు నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఉద్వేగానికి లోనయ్యారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో వేలాది మంది కళాకారులతో ప్రదర్శన నిర్వహించి, అమరవీరులకు నివాళులులర్పించడం చిరస్మరణీయమని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆనం దం వ్యక్తంచేశారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సంస్మరణ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంత్రులు, కళాకారులకు కృతజ్ఞతలు తెలిపారు.