హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి: విద్యార్థులు, అధ్యాపక, సాహితీ లోకానికి ‘తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర’ కరదీపిక వంటిదని ఎైక్సెజ్, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్తో కలిసి తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర గ్రంథాన్ని శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్వయుగం, తొలిపాలకులు, వేములవాడ చాళుక్యుల నుంచి మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమ సాహిత్యం వరకు ఘట్టాలను 50 మంది రచయితలు నిక్షిప్తం చేశారని పేరొన్నారు.
సాహిత్య చరిత్రలో అన్యాయాల తొలగింపునకు సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనతో ముమ్మర యత్నాలు ప్రారంభించామని గౌరీశంకర్ వివరించారు. కార్యక్రమం లో భాషాసాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, గ్రూప్-1 అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మామిళ్ల చంద్రశేఖర్గౌడ్, కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి, ప్రముఖ సాహిత్య విమర్శకుడు కేపీ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.