Telangana | హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక 2024 డైరీని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరేందుకు జర్నలిస్టులు తమవంతు కృషి చేయాలని సీఎం కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మహ్మద్ సాదిక్ పాష, వైస్ ప్రెసిడెంట్లు కోడురు శ్రీనివాసరావు, జంగిటి వెంకటేష్, జాయింట్ సెక్రటరీ మధు మల్కేడికర్, కోశాధికారి సురేశ్ వేల్పుల, ఎక్జిక్యూటివ్ మెంబర్లు సోము సముద్రాల, కంచెరాజు తదితరులు పాల్గొన్నారు. డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డికి జర్నలిస్టులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.