జొమాటోలో ఎమర్జెన్సీ ఫీచర్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సరికొత్త నిర్ణయం తీసుకున్నది. కొవిడ్-19 పీడితులకు త్వరగా డెలివరీలు అందించేందుకు తన యాప్లో ‘ఎమర్జెన్సీ’ ఫీచర్ను పొందుపర్చింది. ఈ యాప్లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ‘ఎమర్జెన్సీ’ మార్క్ను టిక్ చేసినవారికి ప్రాధాన్య ప్రాతిపదికపై వేగంగా ఆహారాన్ని అందజేస్తామని జొమాటో స్పష్టం చేసింది. ఇలాంటి డెలివరీలకు అదనపు చార్జీలేమీ ఉండవని, అన్ని డెలివరీలు ‘కాంటాక్ట్లెస్’గా ఉంటాయని తెలిపింది. ఎమర్జెన్సీ ఆర్డర్ల కోసం ప్రత్యేకంగా కస్టమర్ సపోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఇది యాపిల్ ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని వివరించింది.