హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి, అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో దేశంలోనే నంబర్ వన్గా గుర్తింపు పొందింది. ఈ తరహా పథకాన్ని ఆంధ్రప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో కూడా అమలు చేస్తున్నప్పటికీ, అక్కడ అందజేస్తున్న ఆర్థిక సాయం తెలంగాణ కంటే తక్కువ. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీకి అందజేసిన సామాజిక, ఆర్థిక సర్వే రిపోర్టు స్పష్టంచేసింది.
2014 అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 10, 56, 239 మంది ఆడబిడ్డలకు రూ.9,803.97 కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని అందజేసింది. తొలుత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతులకు అందజేసిన ఈ పథకాన్ని 2017 నుంచి బీసీలకు కూడా వర్తింపజేశారు. ఈ పథకం కింద ఆయా వర్గాల్లోని అర్హులైన ఆడబిడ్డలకు పెండ్లికానుకగా రూ.1,00, 116 చొప్పున, దివ్యాంగులకైతే రూ.1,25,145 చొప్పున అందజేస్తున్నారు. ఈ పథకం కింద లబ్ధిపొందిన యువతులు ముఖ్యమంత్రి కేసీఆర్కు తమ హృదయాల్లో మేనమామ స్థానమిచ్చి, గౌరవించుకొంటున్నారు. తెలంగాణలో కుల, మతాల తేడా లేకుండా అందరికీ ఒకేరకమైన సాయం అందజేస్తుండగా.. ఇతర రాష్ర్టాల్లో అందజేసే సాయంలో కులాలవారీగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
తెలంగాణలో కల్యాణలక్ష్మి/షాదీముబారక్ కింద అందజేస్తున్న ఆర్థికసాయం
ప్రారంభించిన తేదీ :2014 అక్టోబర్ 2
2014-2017 వరకు :రూ.51,000
2017-2018 వరకు :రూ,75,116
2018 మార్చి 19 నుంచి: రూ.1,00,116
దివ్యాంగ ఆడబిడ్డలకు :రూ.1,25,145
ఆడబిడ్డల పెండ్లి కోసం వివిధ రాష్ర్టాల్లో అందజేస్తున్న ఆర్థికసాయం (రూపాయల్లో)
తెలంగాణ :1,00,116 (అర్హులైన అన్నికులాలు, మైనారిటీలకు సమానంగా)
ఆంధ్రప్రదేశ్ :35 వేల నుంచి 50 వేలు (కులాన్ని బట్టి హెచ్చుతగ్గులు)
హర్యానా :31వేల నుంచి 71వేలు (కులాన్ని బట్టి హెచ్చుతగ్గులు)
మధ్యప్రదేశ్ :51,000 (తెలంగాణలో మాదిరిగా సమానంగా)
కర్ణాటక :50,000 (కేవలం ముస్లింలు, మైనారిటీలకు)
ఆడబిడ్డల కల్యాణం కోసం వివిధ రాష్ర్టాల్లో అందజేస్తున్న ఆర్థిక సాయం
తెలంగాణ
పథకం పేరు :కల్యాణలక్ష్మి/షాదీముబారక్
ఆదాయ పరిమితి :రూ.2 లక్షలు
లబ్ధిదారులు :ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ
అందించే ఆర్థికసాయం :రూ.1,00,116
దివ్యాంగులకు :రూ.1,25,145
ఆంధ్రప్రదేశ్
పథకం పేరు :వైఎస్సార్ పెండ్లికానుక/ దుల్హన్
ఆదాయ పరిమితి ;రూ.2లక్షలు
లబ్ధిదారులు :ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు
అందించే ఆర్థిక సాయం :ఎస్సీలకు రూ.40వేలు, ఎస్టీలకు రూ.50వేలు,బీసీలకు రూ.35 వేలు, మైనారిటీలకు రూ.50వేలు
దివ్యాంగులకు :రూ. లక్ష
మధ్యప్రదేశ్
పథకం పేరు :ముఖ్యమంత్రి కన్యా వివాహ్/నిఖాహ్ యోజన
ఆదాయ పరిమితి :రూ.1.80 లక్షలు
లబ్ధిదారులు :ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ
అందించే ఆర్థిక సాయం :రూ.51 వేలు
దివ్యాంగులు :రూ.51 వేలు
కర్ణాటక
పథకం పేరు :బిదాయి
ఆదాయ పరిమితి :రూ.1.80 లక్షలు
లబ్ధిదారులు :కేవలం ముస్లింలు, మైనారిటీలు మాత్రమే
అందించే ఆర్థిక సాయం :రూ.50వేలు
దివ్యాంగులు :ప్రత్యేకంగా ఏమీ ఇవ్వడం లేదు
హర్యానా
పథకం పేరు :ముఖ్యమంత్రి వివాహ్ షగున్ యోజన
ఆదాయ పరిమితి :రూ.లక్ష, రెండున్నర ఎకరాల లోపు భూమి
లబ్ధిదారులు :ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ
అందించే ఆర్థిక సాయం :ఎస్సీ,బీసీ, మైనారిటీలకు రూ.31 వేలు, ఎస్టీలకు రూ.71 వేలు,
దివ్యాంగులకు :ఇద్దరికీ వైకల్యముంటే రూ.51 వేలు, ఒక్కరికే వైకల్యముంటే రూ.31 వేలు