కలెక్టరేట్, ఏప్రిల్ 3 : అభివృద్ధి, సంక్షేమ పథకాలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో పలు అభివృద్ధి పనులను ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదన్నారు.
గ్రామాలు, పట్టణాలలో ఇంటింటికి మంచినీరు, రోడ్లు, డ్రైనేజీలు, ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ.. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శకంగా ఉన్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత, కమిషనర్లు ఎ.వాణిరెడ్డి, స్వామి, వైస్ చైర్మన్లు మల్లేష్, మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కో-అప్షన్ సభ్యులు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.