రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం పథకాలు దేశానికే దిక్చూచిగా మారాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, విద్యా శాఖ మంత్రి సబితారెడ్డిలు అన్నారు. ఆదివారం చేవెళ్ల నియజకవర్గంలోని మోయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థానలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజల అవసరాలను, సౌకర్యాలను గుర్తించి సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి పంట పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయం అందించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఇప్పుడు సొంత ఇంటి జాగా ఉంటే రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వారు పేర్కొన్నారు.
సర్కారు బడులను బలోపేతం చేసేందుకే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు.
కార్యకక్రమంలో రంగారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ అనిత, వికారాబాద్ జెడ్పీచైర్ పర్సన్ సునిత, చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు పాల్గొన్నారు.