హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర నీటిపారుదల రంగ మాజీ సలహాదారు, కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజినీర్ దివంగత ఆర్ విద్యాసాగర్రావు చేసిన సేవలు ప్రతిఒకరికి స్ఫూర్తిదాయకమని వక్తలు పేరొన్నారు. విద్యాసాగర్రావు 84వ జయంతిని పురసరించుకొని మంగళవారం హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో తెలంగాణ ఇరిగేషన్ డే నిర్వహించారు. సాగునీటి పారుదల రంగంలో విశేష కృషిచేసిన ఆరుగురు ఇంజినీర్లకు పురసారాలు అందజేశారు.
అనిల్కుమార్, ఈఎన్సీ (పరిపాలన), వీరబొమ్మ అజయ్కుమార్ (సీఈ, నల్లగొండ), ఎస్ భీమ్ప్రసాద్ (ఎస్ఈ- జాయింట్ సెక్రటరీ), శ్రీనివాస్రెడ్డి (ఈఈ, సిరిసిల్ల), శైలజ (డీఈఈ, కొండమల్లేపల్లి), స్నేహ (ఏఈఈ, మహబూబ్ నగర్) పురసారాలు అందుకున్నారు. సీఎంవో ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే అనువదించిన ‘భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య వృత్తిగత చరిత్ర-నా వృత్తి జీవితం: అనుభవాలు’ పుస్తకాన్ని ఆవిషరించారు.
కేంద్ర నీటిపారుదల జల విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టుల అనుమతుల కమిటీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ పీజీశాస్త్రి, విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కర్ణాటక చైర్మన్ నాగరాజ్, తెలంగాణ చైర్మన్ వెంకటసుబ్బ య్య, మాజీ చైర్మన్ రమణానాయక్ తదితరులు పాల్గొన్నారు.