హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను మంగళవారం ప్రకటించనున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి విడుదల చేయనున్నారు. ఈ నెల ఒకటి నుంచి 10వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల కోసం https://tsbie.cgg.gov.in/ వెబ్సైట్లో చూడొచ్చని బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో ఫస్టియర్లో 63.32 శాతం.. సెకండియర్లో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైన సంగతి తెలిసిందే. మొత్తం 9,28,262 మంది పరీక్షలు రాయగా.. ఫస్టియర్లో 2,94,378 మంది, సెకండియర్లో 4,63,370 మంది ఉత్తీర్ణత సాధించారు.