TS Inter Results | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు అధికారులు సిద్ధమయ్యారు. మంళవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. ఇంటర్ ఫలితాల విడుదల కార్యక్రమం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఇటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్ రెగ్యులర్, ఒకేషనల్ పరీక్షలకు దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాలను నమస్తే తెలంగాణ వెబ్సైట్ ntnews.com లో చెక్చేసుకోవచ్చు.