హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరోసారి నిప్పులు చెరిగారు. శ్రీలంకలో అదానీ ప్రాజెక్టుపై ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ‘ఎ మిత్ర్ కాల్ (A Mitr Kaal)’ లో ‘వన్ నేషన్.. వన్ ఫ్రెండ్ (ఒకే దేశం.. ఒకే మిత్రుడు)’ అనేది కొత్త పథకమని వ్యాఖ్యానించారు.
శ్రీలంకలో అదానీ ప్రాజెక్టును ఆ దేశ ఆర్థిక మంత్రి ‘ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం’గా అభివర్ణించారు. ఈ మేరకు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పత్రికా క్లిప్పింగ్స్ను ట్విటర్లో షేర్ చేస్తూ మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేశారు. అదానీకి ప్రాజెక్టును కట్టబెట్టాలంటూ ప్రధాని మోదీ తమను బలవంత పెట్టారని గతంలో శ్రీలంక చేసిన వ్యాఖ్యలను కూడా మంత్రి గుర్తుచేశారు.
నరేంద్రమోదీ సర్కారు తమ పాలనా కాలాన్ని అమృత కాలమని చెప్పుకోవడం, వన్ నేషన్.. వన్ పెన్షన్, వన్ నేషన్.. వన్ రేషన్కార్డ్ లాంటి పథకాలను తీసురావడాన్ని దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ తనదైన శైలిలో ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమృత కాలాన్ని ఎ మిత్ర్ కాల్గా కేటీఆర్ అభివర్ణించారు. వన్ నేషన్ .. వన్ ఫ్రెండ్ అనేది ఎ మిత్ర్ కాల్లో కొత్త పథకమని వ్యాఖ్యానించారు.
Sri Lanka Govt says Adani project is Govt – to – Govt deal !!
Earlier the same Sri Lanka Govt had said that PM Modi forced them to hand the project to Adani
“One Nation – One Friend” is the new scheme in “A Mitr Kaal”#AdaniScam #MitrKaal pic.twitter.com/DBEBzoix5n
— KTR (@KTRBRS) March 6, 2023