Group-1 | హైదరాబాద్ : గ్రూప్-1 నియామకాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని కోర్టు సూచించింది. ఇక గ్రూప్-1లో అవకతవకలు జరిగాయని ఇప్పటి వరకు 20 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తుది తీర్పు వెలువడే వరకు పోస్టింగ్స్ ఇవ్వొద్దని చెప్పింది.