హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): నోటరీతో కొనుగోలు చేసిన 125 గజాలలోపు స్థలాల్లో నిర్మించుకున్న ఇండ్ల క్రమబద్ధీకరణకు జూలై 26న జారీచేసిన జీవో 84 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోను కొట్టేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాస నం సోమవారం విచారణ చేపట్టింది.
జీవో 84 రిజిస్ట్రేషన్ చట్టంలోని 9వ సెక్షన్ పరిధిని మిం చిపోయినట్టుగా ఉందనిపిస్తున్నదని, ఆ జీవోలోని 10వ క్లాజ్ ఆస్తి బదలాయింపు చట్టం-1882తోపాటు రిజిస్ట్రేషన్ చట్టం-1989కు విరుద్ధంగా ఉన్నదని ధర్మాసనం అభిప్రాయపడింది. సెక్షన్ 9 ప్రకారం స్టాంప్ డ్యూ టీపై పె నాల్టీ విధించేందుకు వీల్లేదని, నోటరీ పత్రాలను లింక్ డాక్యుమెంట్లుగా రిజిస్ట్రేషన్ అధికారులు పరిగణించకూడదని పేర్కొన్నది. ఈ నేపథ్యంలోనే జీవో 84 అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ప్రకటిస్తూ.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈలో గా ప్రభుత్వం జీవో 84కి సంబంధించి పూర్తి వివరాలను, రికార్డులను అందజేయాలని, స మగ్రంగా కౌంటర్ వేయాలని ఆదేశించింది.