హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఎన్ఎస్యూఐ నేతలు వేసిన పిటిషన్ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఓయూ వైస్ చాన్సెలర్ను ఆదేశించించేందుకు నిరాకరించింది. ఈ విషయంలో నిర్ణయాన్ని హైకోర్టు వీసీకే వదిలి వేసింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ నెల 7న ఓయూలో పర్యటించి.. విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొనాల్సి ఉంది.
అయితే, ఆంక్షల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ అందుకు అనుమతి నిరాకరించారు. ఈ విషయమై ఇదివరకే తెలంగాణ కాంగ్రెస్.. హైకోర్టును ఆశ్రయించగా, తుది నిర్ణయం వీసీదేనని హైకోర్టు సైతం స్పష్టం చేసింది. తాజాగా ఎన్ఎస్యూ దాఖలు చేసిన హౌజ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రాహుల్ పర్యటనకు అనుమతి ఇచ్చేలా ఓయూ వీసీని ఆదేశించాలని కోరింది. ఈ మేరకు పిటిషన్పై విచారణ న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేస్తూ.. వీసీదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది.