హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): కూకట్పల్లి 8వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి బొమ్మతి భవానీని సస్పెండ్ చేస్తూ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు సమర్పించిన ఆధారాలను పట్టించుకోకుండా నిందితుడికి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేయడమే ఇందుకు కారణం.
దీనిపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. అభియోగాలను ఎదురొంటున్న మెజిస్ట్రేట్ భవానీని సస్పెండ్ చేస్తున్నట్టు హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) కే సాయి రమాదేవి ప్రకటించారు.