తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఖరారు చేయొద్దని షరతు
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ): ‘మన ఊరుమన బడి’ పథకం కింద అవసరమై న ఫర్నిచర్ కొనుగోళ్ల టెండర్ ప్రక్రియ కొనసాగింపునకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అనుమతిచ్చిం ది. ప్రభుత్వ, స్థానిక బడులకు టేబుళ్లు, గ్రీన్బోర్డులు మొదలైనవి కొనుగోలు చేయడానికి గత మే 9న ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది.
టెండర్ ప్రక్రియను కొనసాగించడానికి అనుమతిచ్చిన హైకోర్టు, తదుపరి ఉత్తర్వుల జారీ వరకు టెండర్లను ఖరారు చేయవద్దని షరతు విధించింది. పిటిషనర్ల వాదనలు వినాల్సి ఉన్నదని, అందుకే ఈ షరతు విధిస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి స్పష్టం చేశారు. విచారణను ఈ నెల 11కు హైకోర్టు వాయిదా వేసింది.