హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కాంట్రిబ్యూటరీ పెన్షన్ సీం ఎంప్లాయిస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) నిర్వహించ తలపెట్టిన ‘పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర’కు తెలంగాణ గ్రూప్ – 1 అధికారుల సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ సీం (సీపీఎస్ )ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న ప్రధాన డిమాండ్తో సీపీఎస్ఈయూ.. 16 నుంచి రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ సంకల్ప రథయాత్ర నిర్వహించనున్నది.
ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్ను శుక్రవారం హైదరాబాద్లో గ్రూప్ – 1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్, ప్రధానకార్యదర్శి హన్మంతు నాయక్, సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్ తదితరులు ఆవిష్కరించారు.