హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం అని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రేపు మాపో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం. కొత్త జోనల్ విధానం తీసుకొచ్చాం. రాష్ట్ర యువత హక్కులు సాధించాం. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. మల్టీ జోనల్ పోస్టింగ్ విధానం తీసుకొచ్చాం. దీని ద్వారా 5 శాతం మాత్రమే స్థానికేతరులు వస్తారు.
పరిపాలన తెలియని వారంతా ఏదేదో మాట్లాడుతున్నారు. సిగ్గు లేకుండా 317 జీవోను విమర్శిస్తున్నారు. కొంతమంది స్వార్థపరులైన ఉద్యోగులు మేం ఇక్కడే ఉంటామని అంటున్నారు. 317 జీవో గురించి మాట్లాడితే వారిని లాగి కొట్టాలి. స్థానిక నిరుద్యోగులకు 317 జీవో వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.