హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ)ః తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.
నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం మా మిడిపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నదని 2014లో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయన్, జస్టిస్ సీవీ భాసర్రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు గనుల శాఖ సహాయ డైరెక్టర్ బీ సత్యనారాయణ హాజరై వివరణ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందిన హైకోర్టు పిల్పై విచారణను ముగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.