నేడు దీవకొండ, పార్థసారథి నామినేషన్
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి వచ్చేనెల 21తో పదవీ కాలం ముగిసే రెండు రాజ్యసభస్థానాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ అయింది. రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో పోటీచేసే టీఆర్ఎస్ అభ్యర్థులుగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నమస్తే తెలంగాణ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావు, హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి పేర్లను ఖరారు చేసిన విషయం తెలిసిందే.
వారిరువురు బుధవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో టీఆర్ఎస్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు.