హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ విద్యార్థులకు అద్భుత అవకాశం. ఈ ఏడాది నుంచి వీరంతా ఐదేండ్ల లా కోర్సులో చేరేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి పొందడానికి ప్రతిపాదనలు పంపించారు. దీనిపై సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నది. గతంలో పాలిటెక్నిక్ పూర్తిచేసిన వారు ఇంజినీరింగ్ కోర్సుల్లోనే చేరేవారు. ఇప్పుడు లా కోర్సు చదివే అవకాశం కల్పించనున్నారు. ఈ తరహాలో ఇప్పటికే డిగ్రీలో చేరడానికి విద్యార్థులకు అవకాశం కల్పించిన విషయం విదితమే. మూడేండ్ల పాలిటెక్నిక్ కోర్సులో చేరిన విద్యార్థులు రెండో సంవత్సరం తర్వాత ఎగ్జిట్ అయ్యే చాన్స్ ఇచ్చారు. ఇలాంటి వా రు నిర్దిష్ట క్రెడిట్స్ పొందితే.. వారికి ఇంటర్మీడియట్ తత్సమాన సర్టిఫికెట్లను జారీ చేస్తారు. గత ఏడాది నుంచే అందజేస్తున్న ఈ సర్టిఫికెట్లతో ఐదేండ్ల లా కోర్సులో చేరేలా అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇదే విషయాన్ని బుధవారం విడుదలయ్యే లాసెట్ నోటిఫికేషన్లో పొందుపరుస్తారు.
షెడ్యూల్ విడుదల..
టీఎస్ లాసెట్, పీజీలాసెట్ షెడ్యూల్ విడుదలైంది. సోమవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ డీ రవీందర్ ఈ షెడ్యూల్ను రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ మాత్రం బుధవారం వెల్లడికానున్నది. దరఖాస్తుల స్వీకరణ మార్చి 2 నుంచి ప్రారంభిస్తారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాస్రావు, లా, పీజీలాసెట్ కన్వీనర్ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.