హైదరాబాద్, మార్చి 7 : కేసీఆర్ కిట్ రాష్ట్ర ప్రభుత్వ సూపర్హిట్ స్కీమ్. ఇప్పుడు అదే బాటలో మరో వినూత్న పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నది. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లోని మహిళలు తీవ్రమైన రక్తహీనత, పిల్లల్లో పోషకాహారలోపం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవటం, మందబుద్ధి మొదలైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సర్కారు వీరికి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నది.
విద్యార్థినులకు హైజీనిక్ కిట్లు
7 నుంచి 12 తరగతి విద్యార్థినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజీనిక్ కిట్లను పంపిణీ చేయబోతున్నట్టు సర్కారు ప్రకటించింది. పథకం వల్ల 7 లక్షల మందికి ప్రయోజనం కలుగనున్నది. కాగా, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్లో 1,976.59 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోల్చితే రూ.274.59 కోట్లు ఎక్కువ.