E-Tenders | హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రైస్ మిల్లుల్లోని ధాన్యం వేలం వేసేందుకు గ్లోబల్ ఈ-టెండర్లను ఆహ్వానిస్తూ పౌరసరఫరాల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళవారం నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు బిడ్ దాఖలుకు అవకాశం కల్పించింది. వివరాలను www.tender.telangana.gov.inలో పొందుపరిచింది. కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ కొర్రీలతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలోని వ్యాపారులపై గోధుమల నిల్వపై పౌరసరఫరాలశాఖ ఆంక్షలు విధించింది. ఇప్పటినుంచి 2024 మార్చి 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ అనిల్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.