హైదరాబాద్ : ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి తెలంగాణ సర్కార్ అండగా నిలిచింది. మంత్రి కేటీఆర్ చొరవతో అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి కొండంత భరోసా అందింది. పేదోడి బాధను, సమాజంలోని అసమానతలను అద్భుతంగా అక్షరీకరించిన అలిశెట్టి జయంతి, వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ పరిస్థితిని పలువురు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుని వచ్చారు.
వెంటనే స్పందించిన కేటీఆర్, అలిశెట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడాలని ఆయన కార్యాలయ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అలిశెట్టి భార్య భాగ్యతో మాట్లాడిన అధికారులు, వాళ్ల అభిప్రాయాన్ని తెలుసుకుని మంత్రికి తెలిపారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్, సొంత ఇల్లు విషయంలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.