హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫైల్పై శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంతకం చేశారు. రాష్ట్రంలోని 194 మాడల్ సూళ్లలో 3 వేలకుపైగా టీచర్లున్నారు. వీరంతా పదేండ్ల నుంచి నియామక స్థానం నుంచే పనిచేస్తున్నారు. తమను బదిలీ చేయాలని టీచర్లు కొంతకాలంగా చేస్తున్న విజ్ఞప్తి మేరకు తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నది.
వచ్చేవారంలో పూర్తి షెడ్యూల్ విడుదల చేయనున్నది. ఇందుకు మాడల్స్కూళ్ల పాలకమండలి (ఈసీ) ఆమోదం తీసుకోవాల్సి ఉన్నది. పాత జోనల్ విధానం ప్రకారమే బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టుగా విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. కాగా, షెడ్యూల్ను వెంటనే ప్రకటించి, బదిలీల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సహకరించిన ప్రభుత్వానికి, మంత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.