నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..! ఉమ్మడి రాష్ట్రంలో వైద్యరంగం దుస్థితి ఇది.
ప్రభుత్వ దవాఖానలో ప్రసవిస్తే కేసీఆర్ కిట్.. లక్షల విలువ చేసే అవయవ మార్పిడి చికిత్స.. 36 లక్షల మందికి 340 కోట్లు విలువైన టెస్టులు.. తెలంగాణ డయాగ్నస్టిక్స్లో 6.46 కోట్ల పరీక్షలు ఎనిమిదేండ్ల తెలంగాణలో వచ్చిన మార్పు ఇది.
అత్యవసర చికిత్సకు హైదరాబాద్ పోవాల్సిందే. ఇది ఒకప్పటి మాట. జిల్లా కేంద్రంలోని దవాఖానల్లోనే కార్పొరేట్ను తలదన్నే సౌకర్యాలు, అనుభవజ్ఞులైన వైద్యులు.. ఇప్పడు కనిపిస్తున్న దృశ్యం.
తెలంగాణ వచ్చిన ఎనిమిదేండ్లలో వైద్యరంగం బలోపేతమైందనడానికి ఇదే నిదర్శనం. కంటి వెలుగుతో దారిచూపి, దీర్ఘకాలిక రోగులకు ఔషధాల కిట్లతో అండగా నిలిచి, హైదరాబాద్లో రోగుల సహాయకులకు భోజన వసతి కల్పిస్తూ ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. పీహెచ్సీ నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు ఐదంచెల్లో వైద్యం అందుతున్నది. హైదరాబాద్లో కొత్తగా నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలతోపాటు వరంగల్లోనూ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి రూపకల్పన రాష్ట్ర వైద్యరంగంలో మరో మైలురాయి. భవిష్యత్తులో మళ్లీ కరోనా వంటి విపత్కర పరిస్థితి ఎదురైనా తట్టుకొనే వ్యూహంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యం కాగా, అందులో 12 అందుబాటులోకి వచ్చాయి. మూడు నాలుగేండ్లలో 2,790 మంది ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులోకి రానున్నారు. 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు వస్తే దాదాపు 10 వేల ఎంబీబీఎస్ సీట్లు, వీటికి అనుబంధంగా 21,450 పడకలు అందుబాటులోకి రానున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది రాష్ట్రంలోని అనేక జిల్లా కేంద్రాలకు ప్రభుత్వం సీనియర్ రెసిడెంట్లను పంపింది. మరింత మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నది. హైదరాబాద్కు వెళ్తేనే మంచి వైద్యం.. స్పెషాలిటీ సేవలు దొరుకుతాయనే భావన ప్రజల్లో పాతుకుపోయింది. దీనిని తొలిగించేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం క్రమంగా అనేక చర్య లు తీసుకొంటున్నది. తొలుత పీహెచ్సీలు సహా అన్ని స్థాయిల దవాఖానలను బలోపేతం చేసింది. తర్వాత.. దవాఖానల అప్గ్రేడేషన్ చేపట్టి అత్యాధునిక పరికరాలు, సిబ్బందిని కేటాయించింది. జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రతి జిల్లా కేంద్రంలోని దవాఖానను జిల్లా దవాఖానగా అభివృద్ధి చేస్తున్నది. దీంతో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. దవాఖానలకు వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల వైద్యసేవల్లో అంతరాయం కలుగుతున్నది. మరికొన్ని చోట్ల వైద్యుల కొరత ఉన్నది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఈ ఏడాది సీనియర్ రెసిడెంట్ల సేవలను వినియోగించుకుంటున్నది. జిల్లాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేలా వారిని 24 జిల్లాలకు కేటాయించింది.
మెడికల్ పీజీ పూర్తి చేసిన వైద్య విద్యార్థులను వైద్యారోగ్య శాఖ ‘సీనియర్ రెసిడెంట్లు’గా నియమిస్తుంది. వీరు ఏడాది కాలంపాటు కేటాయించిన దవాఖానల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అడ్మిషన్ సమయంలోనే బాండ్ రాసి ఇస్తారు. కౌన్సిలింగ్ నిర్వహించి మెరిట్ ఆధారంగా ఆప్షన్లు ఇచ్చి దవాఖానలను కేటాయిస్తారు. గతంలో సీనియర్ రెసిడెంట్లలో అత్యధిక శాతం మంది హైదరాబాద్కే పరిమితం అయ్యేవారు. కొందరు వరంగల్, కరీంనగర్ వంటి నగరాలకు వెళ్లేవారు. పోస్టింగ్ల కోసం రికమండేషన్లు, ఒత్తిళ్లు కూడా ఉండేవి. దీంతో జిల్లాలకు సేవలు అందకపోయేవి. కానీ, ఈ దఫా ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని, జిల్లాలకు పంపి వైద్యాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులు విస్తృతంగా నేర్చుకొనేందుకు అవకాశం కల్పించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఈ ఏడాది ఆగస్టులో జరిగిన సీనియర్ రెసిడెంట్ల కౌన్సిలింగ్లో 862 మందికి వివిధ దవాఖానల్లో పోస్టింగ్ ఇవ్వగా, దాదాపు 90 శాతం మందిని జిల్లాలకే కేటాయించారు. హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు 34 మంది, ఉస్మానియా దవాఖానకు 54 మంది చొప్పున మొత్తంగా 88 మందిని మాత్రమే రాజధానిలో ఉంచారు. మిగతా 774 మందిని 24 జిల్లాలకు పంపించారు. ఈ యువ వైద్యులతో జిల్లా దవాఖానలు కళకళలాడుతున్నాయి.
ఎన్నో ప్రయోజనాలు
గ్రామీణ జిల్లాలకు తరలిన వైద్యులు
మొదటిసారి వచ్చారు
నిర్మల్ జిల్లా దవాఖానలో మొదటిసారి మొత్తం 14 విభాగాలకు 24 మంది సీనియర్ రెసిడెంట్లను నియమించారు. మా దవాఖానకు అదనపు బలం వచ్చినట్టయింది. ఓపీ నుంచి ఐసీయూ వరకు సేవలు మరింత మెరుగ్గా అందుతున్నాయి. ప్రొఫెసర్ల పర్యవేక్షణలో విద్యార్థులు సైతం చక్కగా నేర్చుకొంటున్నారు. సహనంతో చికిత్స అందిస్తున్నారు. దీంతో డాక్టర్లపై పని ఒత్తిడి తగ్గింది.
– ఏనుగు దేవేందర్రెడ్డి, నిర్మల్ జిల్లా దవాఖాన సూపరింటెండెంట్
పేషెంట్ కేర్ పెరిగింది
నల్లగొండ జిల్లాకు ప్రభుత్వం 48 మంది సీనియర్ రెసిడెంట్లను కేటాయించింది. దీంతో హాస్పిటల్లో పేషెంట్ కేర్ పెరిగింది. ఇప్పటికే ఉన్న సీనియర్ డాక్టర్లతోపాటు సీనియర్ రెసిడెంట్లు సైతం షిఫ్ట్ డ్యూటీల్లో ఉంటున్నారు. రోగులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొంటున్నారు. డాక్టర్ నేరుగా మాట్లాడుతుండటంతో బాధితులకు సాంత్వన కలుగుతున్నది. – మురళీధర్రెడ్డి,
సూర్యాపేట జిల్లా దవాఖాన సూపరింటెండెంట్
మారుమూల జిల్లా కేంద్రమైన నిర్మల్లోని ప్రభుత్వ దవాఖాన ఇప్పుడు యువ వైద్యులతో కళకళలాడుతున్నది. ఇందుకు కారణం తొలిసారిగా వైద్యారోగ్యశాఖ అధికారులు ఇటీవల 24 మంది సీనియర్ రెసిడెంట్లను కేటాయించారు. దీంతో దవాఖానలోని 14 విభాగాలు బలోపేతం అయ్యాయి. ముఖ్యంగా గైనకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాలకు ముగ్గురు చొప్పున సీనియర్ రెసిడెంట్లు నియమితులయ్యారు. దీంతో గర్భిణులకు మరిన్ని మెరుగైన సేవలు అందుతున్నాయి. పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, అనస్థీషియా విభాగాలకు ఇద్దరు చొప్పున, పాథాలజీ, ఈఎన్టీ, రెస్పిరేటరీ మెడిసిన్, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, సైకియాట్రీ, పాథాలజీలో ఒక్కొక్కరు చొప్పున చేరారు. దీంతో ఆయా విభాగాలు బలోపేతమై, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతున్నాయి. ఇలాంటి పరిస్థితే అనేక జిల్లాల్లో కనిపిస్తున్నది.
సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పట్టణాల్లో ప్రాథమిక వైద్యం అందించేందుకు రాజధాని హైదరాబాద్ సహా మున్సిపాలిటీల్లో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 331 బస్తీ దవాఖానలు ఉండగా, వీటిని దాదాపు 500కు పెంచనున్నారు. ఈ దవాఖానల్లో ఇప్పటివరకు 2.11 కోట్ల ఓపీ నమోదైంది. ఫలితంగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్ హాస్పిటళ్లపై ఒత్తిడి తగ్గటంతో, వారు సర్జరీలపై ఎక్కువ దృష్టిపెట్టారు.
2019తో పోల్చితే ఓపీ తగ్గిందిలా..