హైదరాబాద్ : తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 30వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 8వ తేదీ నుంచి నేటి వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. నేటితో సెలవులు ముగియనున్న నేపథ్యంలో.. విద్యాసంస్థల్లో కొంతకాలం ప్రత్యక్ష తరగతులు నిర్వహించరాదని వైద్యారోగ్య శాఖ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి కారణంగా వైద్యారోగ్య శాఖ ఈ సిఫారసు చేసినట్లు సమాచారం.