హైదరాబాద్, మార్చి 6 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల భవనాల పటిష్ఠతకు అధికారులు చర్యలు చేపట్టారు. మన ఊరు-మన బడి పథకంలో భాగంగా భవనాల పైకప్పుల మరమ్మతులకు ప్రణాళికలు రూపొందించారు. స్కూళ్లవారీగా సర్వే నిర్వహించిన అధికారులు పలు సమస్యలను గుర్తించారు. పైకప్పులు ఎత్తులు పల్లాలు ఉండటం, వర్షపు నీటిని కిందికి పంపించే వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, కాంక్రీట్ నాణ్యతలోపం వంటి సమస్యలను గుర్తించారు. మరమ్మతు చర్యల్లో భాగంగా పాఠశాల పాత భవనాల స్లాబులకు ఐదు లేయర్ల పూత పూయనున్నారు. వర్షపు నీరు లీకేజీలు లేకుండా వాటర్ ఫ్రూఫింగ్ ట్రీట్మెంట్ చేయనున్నారు. తద్వారా ఐదేండ్లపాటు పాఠశాల భవనాలు చెక్కుచెదరకుండా ఉంటాయని అధికారులు తెలిపారు.
చేపట్టే పనులు ఇవే..
ఐదు లేయర్లు ఇవే..