హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన కల్లుగీత కార్మికులు, తాటి చెట్టు నుంచి పడి గాయపడిన బాధితులకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసినట్టు తెలంగాణ టాడి టాపర్స్ కార్పొరేషన్ గురువారం తెలిపింది.
ఇటీవల మరణించిన బాధితుడి కుటుంబానికి రూ.25 వేలు, గాయపడిన 27 మంది కార్మికులకు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.4.30 లక్షలను త్వరలో అందజేయనున్నారు.