హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): తాటి చెట్టుపై నుంచి పడి గాయపడిన గీతకార్మికులకు రూ.15వేల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరైనట్టు తెలంగాణ టాడీ టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ సెక్షన్ అధికారి పాముకుంట్ల రవీందర్గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవలకాలంలో తాటి చెట్టుపై నుంచి పడి ఏడుగురు గాయపడ్డారని, వారికి వైద్యఖర్చుల నిమిత్తం ప్రభుత్వం రూ.15వేల చొప్పున మంజూరు చేసిందని వివరించారు.
రెండు రోజుల్లో సంబంధిత చెక్కులు బీసీడీవోలకు చేరుకొంటాయని వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వానికి, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.