హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కొవిడ్తో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు రూ.50 వేల ఎక్స్గ్రేషియా అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విపత్తుల నివారణశాఖ పేర్కొన్నది. కరోనాతో మరణించినట్టు అఫీషియల్ డాక్యుమెంట్, ఇతర డాక్యుమెంట్లతో రాష్ట్రంలోని 4,500 మీసేవ కేంద్రాల్లో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తుతోపాటు బ్యాంక్ ఖాతా వివరాలు, ఇతర పత్రాలతో మీసేవ కేంద్రాల్లో సంప్రదించాల్సి ఉంటుంది. కలెక్టర్ చైర్మన్గా, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి, జిల్లా కేంద్రంలోని దవాఖాన సూపరింటెండెంట్లు సభ్యులుగా ఉండే కొవిడ్ డెత్ నిర్ధారణ కమిటీ కరోనా మరణానికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని జారీచేస్తుంది. ఇతర వివరాలకు 040-48560012లో గానీ, meesevasupport@ telangana.gov.inలో గానీ సంప్రదించాలని డిజాస్టర్ మేనేజ్మెంట్శాఖ పేర్కొన్నది.