హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): అర్చకులు, ఇతర దేవాదాయ ఉద్యోగుల వేతనాల కోసం శుక్రవారం ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. 2021-22 వార్షిక బడ్జెట్ త్రైమాసిక నిధుల కింద ఫండ్స్ విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరుచేస్తూ ప్రభుత్వం జీవో ఆర్టీ నంబర్ 411 జారీచేసింది.