హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ధూపదీప నైవేద్యం అర్చకుల వేతనాలను పెంచినందుకు కృతజ్ఞతగా బుధవారం రాష్ట్రంలోని అర్చక సంఘాల ప్రతినిధులు సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని సత్కరించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను మంత్రి దృష్టికి తెచ్చారు. మరో 1000 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకాన్ని వర్తింపజేయాలని, అర్చకులందరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
జీవో-121ను రద్దు చేసి, అర్హులైన అర్చకోద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇవ్వాలని కోరారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు, ఎమ్మెల్సీ విఠల్ మంత్రి వెంట ఉండగా, మంత్రిని సత్కరించినవారిలో తెలంగాణ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, ధూపదీప నైవేద్య అర్చకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీ వాసు పెన్నా మోహన్శర్మ, ఎన్ సతీశ్శర్మ, ప్రసాద్శర్మ, గోపీకృష్ణమాచార్యులు తదితరులు ఉన్నారు.