హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. సంఘటిత, అసంఘటిత రంగం అనే తేడా లేకుండా అన్ని వర్గాలకూ మేలు జరిగేలా చర్యలు చేపడుతున్నది. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల ద్వారా 32,350 మందికి రూ.184.07 కోట్ల లబ్ధి చేకూర్చింది. కార్మికశాఖలోని కార్యకలాపాలను పూర్తిగా ఆన్లైన్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేక జాతీయ అవార్డులను కైవసం చేసుకొన్నది. కార్మికుల సంక్షేమం కోసం 2021-22 తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సాధించిన విజయాలను రాష్ట్ర కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి రాణీ కుముదిని వెల్లడించారు.
నిర్మాణరంగ కార్మికులకు : రూ.176.91 కోట్లు
నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరిన 19.68 లక్షల మందిలో 31,829 మందికి అందించిన మొత్తం : రూ.176.91కోట్లు
కర్మాగారాలు, దుకాణాలు, మాల్స్, రవాణా కార్మికుల్లో 383 మందికి : రూ.0.26కోట్లు
అసంఘటిత కార్మికులకు పీఎంఎస్బీవై కింద అందిస్తున్న ప్రమాద బీమా : రూ.2లక్షలు
ప్రమాదవశాత్తూ మరణించిన 138 మంది ట్రాన్స్పోర్ట్/నాన్-ట్రాన్స్పోర్ట్ ఆటోడ్రైవర్లు, వర్కింగ్ జర్నలిస్టులు, హోంగార్డుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెల్లించిన పరిహారం మొత్తం : మొత్తం – రూ.6.90కోట్లు
విజయాలు, అవార్డులు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మికశాఖలోని పలు కార్యకలాపాలను మాన్యువల్ విధానం నుంచి ఆన్లైన్ విధానంలోకి మార్చింది.
2016 నుంచి ఇప్పటివరకు 9.27 లక్షల రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు, రెన్యూవల్స్ పూర్తిచేసింది.
కార్మిక చట్టాలు, నిబంధనల్లో 218 సవరణలు చేయడం ద్వారా రాష్ట్ర కార్మిక శాఖ పలు జాతీయ అవార్డులను కైవసం చేసుకొన్నది.
2015 నాటికి ఈవోడీబీలో 13వ స్థానంలో ఉన్న రాష్ర్టానికి 2016లో 1, 2017లో 2, 2019లో 3వ ర్యాంకు లభించింది.
2017లో సీఎస్ఐ-నిహిలెంట్ అవార్డు, టీఎస్-ఐపాస్కు ఈఓడీబీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు, ఆన్లైన్ సేవలకు 2020-21లో స్కోచ్ అవార్డు లభించాయి.
వైభవంగా మేడే: మంత్రి మల్లారెడ్డి
మేడే వేడుకలకు సిద్ధమైన శ్రామిక లోకానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి రావడంతో ఈసారి మేడే ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మేడే సందర్భంగా ఆదివారం ఉదయం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో పలువురు కార్మికులకు, ఉత్తమ యాజమాన్యాలకు అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు.
నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు (నిధులు రూపాయల్లో)
వివాహ బహుమతి : 30,000
సహజంగా మరణించిన కార్మికుడి కుటుంబానికి: 1,00,000
ప్రమాదంలో మరణించిన కార్మికుడి కుటుంబానికి : 6,00,000
దహన సంస్కారాలకు : 30,000
బోర్డులో సభ్యులుగా చేరిన కార్మికులు వైకల్యం పొందితే: 4,00,000 నుంచి 5,00,000 వరకు
బోర్డులో సభ్యులుగా చేరని కార్మికులు వైకల్యం పొందితే : 50,000
దవాఖానలో చికిత్సకు నెలకు : 4,500 (మూడు నెలల వరకు)
ప్రసూతి ప్రయోజనాలు : 30,000
తెలంగాణ లేబర్ వెల్ఫేర్ బోర్డు పథకాలు
పథకం : లబ్ధి (రూపాయాల్లో)
స్కాలర్షిప్లు : 1,000 నుంచి 2,000
వికలాంగుల స్కాలర్షిప్లు: 4,000
వైద్య సహాయం: 20,000
ఆర్థిక మెరుగుదలకు సహాయం : 30,000
దహన సంస్కార ఖర్చులు: 5,000
వివాహ బహుమతి : 10,000
ప్రసూతి ప్రయోజనం : 5,000
కుటుంబ నియంత్రణ : 2,000
లాస్ ఆఫ్ లింబ్స్ : 10,000-20,000
వైద్య ఖర్చులకు : 20,000 వరకు
సహజ మరణం : 10,000