హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీజలాల పంపిణీకి అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభు త్వం మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని డిమాం డ్ చేసింది. తమిళనాడు చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ 13వ సమావేశం తిరువనంతపురంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి సారథ్యంలో ఉన్నతాధికారుల బృంందం పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను వినిపించింది. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశ ఎజెండాలో చేర్చాలని పట్టుబట్టారు. ఖమ్మం జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎస్ డిమాండ్ చేశారు. కర్ణాటక రాష్ట్రం అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులపై చర్చించే అంశాన్ని కూడా ఎజెండాలో చేర్చాలని ప్రతిపాదించారు. షెడ్యూల్ 9, 10లోని ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల, ప్రభుత్వసంస్థల విభజన చేపట్టాలని, గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం జాతీయ హోదా అంశాన్ని, కర్ణాటక అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల అంశాలను కూడా 31వ కౌన్సిల్ సమావేశ ఎజెండాలో కాకుండా తదుపరి సమావేశానికి కేంద్రం వాయిదా వేసింది.
సదరన్ జోనల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణ ప్రతిష్ఠాత్మకంగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా, వినూత్నంగా అమలు చేస్తున్న రైతుబం ధు, రైతుబీమా, ఆరోగ్యలక్ష్మి, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మే నేజ్మెంట్ సిస్టమ్ పథకాల విశిష్ఠతను సీఎస్ శాంతికుమారి ప్రస్తావించారు. ఆయా పథకాలు, వినూత్న ఆవిష్కరణల ద్వారా రైతులకు, మహిళలకు, వాహనదారులకు కలుగుతున్న ప్రయోజనాలను స్టాండింగ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ పథకాలపై స్టాం డింగ్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో రైతుబంధు, రైతుబీ మా పథకాలపై ప్రజెంటేషన్ ఇప్పించాలని నిర్ణయించడం గర్వకారణం. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, విద్యుత్తుశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్తోపాటు, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్ష్యద్వీప్ అధికారులు పాల్గొన్నారు.