హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం మరో 232 చెక్డ్యామ్ల నిర్మాణానికి రూ.325.85 కోట్లతో అనుమతులు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టేందుకు రాష్ట్రంలోని అన్ని వాగులపై కలిపి సుమారు రూ.3825 కోట్లతో 1200 చెక్డ్యామ్లు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది.
మొదటి విడతలో రూ.2906కోట్లతో 638 చెక్డ్యామ్ల నిర్మాణాన్ని చేపట్టగా, ఆ పనులన్నీ దాదాపు 90% పూర్తయ్యాయి. రెండోదశలో 562 చెక్డ్యామ్లు నిర్మించాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి 232 చెక్డ్యామ్లకు మంజూరు చేసింది.