హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం కుల, చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయడం గొప్పవరమని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎంబీసీ కో-కన్వీనర్ రాచమల్ల బాలకృష్ణ పేర్కొన్నారు. కుల, చేతివృత్తుల పురోగతికి ఇది ఎంతో దోహదపడుతుందని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వల్ల రజక, నాయీ బ్రాహ్మణులతో పాటు బీసీ వర్గాల్లోని కులవృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని కొనియాడారు. సాయం అందిస్తున్న ప్రభుత్వం, సీఎం కేసీఆర్కు కులవృత్తిదారులందరి తరఫున బాలకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.